పార్లమెంటుకు బాంబు బూచి

6 Jan, 2016 02:26 IST|Sakshi

న్యూఢిల్లీ: అసలే జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఢిల్లీలోకి ప్రవేశించారన్న ఇంటెలి జెన్స్ హెచ్చరికలతో.. అప్రమత్తంగా ఉన్న దేశరాజధాని పోలీసులను.. మంగళవారం ఓ ఫోన్‌కాల్ పరుగులు పెట్టించింది. పార్లమెంటు సమీపంలో బాంబు పెట్టినట్లు ఓ ఆకతాయి ఫోన్ కాల్ చేయటంతో ఢిల్లీలో పోలీసులు పరుగులు పెట్టారు. ఈశాన్య ఢిల్లీలోని జ్యోతి నగర్‌నుంచి వచ్చిన ఈ కాల్‌ను విశ్లేషించిన పోలీసులు.. కాల్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు