-

గడ్కరీ పరువునష్టం పిటిషన్‌పై డిసెంబర్ 20న విచారణ

18 Oct, 2014 22:59 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అరవింద్ కేజ్రీవాల్‌పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దాఖలుచేసిన పిటిషన్‌ను డిసెంబర్ 20వ తేదీన స్థానిక న్యాయస్థానం విచారించనుంది. మెట్రోపాలిటన్ కోర్టు మేజిస్ట్రేట్ గోమతి మనోచా శిక్షణా తరగతులకు వెళ్లడంతో శనివారం ఈ పిటిషన్ విచారణకు నోచుకోలేదు. అయితే నితిన్‌తో రాజీకి వచ్చే అవకాశముందంటూ ఇప్పటికే కేజ్రీవాల్.. కోర్టుకు తెలియజేసిన సంగతి విదితమే.
 
 

మరిన్ని వార్తలు