ఇష్రాత్‌ జహాన్ ఫైలు మాయంపై కేసు

25 Sep, 2016 22:11 IST|Sakshi
ఇష్రాత్‌ జహాన్ ఫైలు మాయంపై కేసు

న్యూఢిల్లీ: ఇష్రాత్‌  జహాన్ కేసులో ఫైలు మిస్సయిన ఘటనలో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక్కడి సంసద్ మార్గ్ లో ఉన్న పోలీసు స్టేషన్ అధికారులపై ఉన్నతాధికారులు కేసును నమోదు చేసినట్టు ఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ జితిన్ నార్వల్ తెలిపారు.

2004లో ఇష్రాత్‌ జహాన్‌, జావేద్‌ షేక్‌, జీషన్‌ జోహార్‌, అమజద్‌ అలీ రానాను అహ్మదాబాద్‌ సిటీ క్రైమ్‌ బ్రాంచ్‌ అధికారులు ఎన్‌కౌంటర్‌ చేశారు. ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని ఇష్రాత్‌ తల్లి షామియా కౌశర్‌ గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై 2013లో సీబీఐ తొలి ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది.
 

మరిన్ని వార్తలు