మారన్ ఆస్తులు అటాచ్

2 Apr, 2015 04:11 IST|Sakshi
మారన్ ఆస్తులు అటాచ్

కేంద్ర టెలికం మాజీ మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి, వారి కుటుంబసభ్యులకు సంబంధించిన 742 కోట్ల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ అటాచ్ చేసింది. ఎయిర్‌సెల్-మాక్సిస్ మనీలాండరింగ్ కేసులో ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ కేసులో బుధవారం వారి ఆస్తులను అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అటాచ్ చేసిన వాటిలో దయానిధి మారన్, ఇతరులకు చెందిన రూ. 7.47కోట్ల ఎఫ్‌డీలు, కళానిధి మారన్‌కు చెందిన రూ. 100 కోట్ల ఎఫ్‌డీలు, రూ. 2.78 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. అలాగే, కళానిధి భార్య కావేరికి చెందిన రూ. 1.3 కోట్ల విలువైన ఎఫ్‌డీలు, రూ. 1.78 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్స్‌ను కూడా ఈడీ అటాచ్ చేసింది.

మరిన్ని వార్తలు