ప్రముఖ పర్వాతారోహకుడి హఠాన్మరణం

21 Nov, 2016 16:34 IST|Sakshi
ప్రముఖ పర్వాతారోహకుడి హఠాన్మరణం

కోల్కతా: ప్రముఖ పర్వతారోహకుడు ప్రదీప్‌ సాహూ(50) హఠాన్మరణం చెందారు. పశ్చిమ బెంగాల్కు చెందిన ఆయన ఆదివారం సాయంత్రం గుండెపోటుతో జింబాబ్వే రాజధాని హరారేలో కన్నుమూశారు. కోల్కతాలోని టాలిగుంగే ప్రాంతానికి చెందిన ఆయన పర్వతారోహకుల్లో ప్రముఖులు. ఈ ఏడాది కూడా ఆయన తన భార్య చేతనతో కలిసి ఎవరెస్టును మూడోసారి అధిరోహించారు. ఓ మైనింగ్ కంపెనీకి డైరెక‍్టర్ గా ఉన్న ఆయన చాలా ఏళ్లుగా వివిధ పర్వాతాలను తన భార్యతోకలిసి అధిరోహిస్తుంటారు.

ఐదేళ్ల కిందటే ఓ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించారు. ఇటీవలె వ్యక్తిగత పనుల నిమిత్తం హరారే వెళ్లారు. ఆయనకు ఇటీవలె బెంగాల్ ప్రభుత్వం రాధానాథ్ షిక్దార్ అవార్డును కూడా ప్రకటించింది. దానిని ఈ నెల తర్వాత అందించనున్నారు. సాహూ మరణ వార్త విని దిగ్బ్రాంతి చెందానని, ఆయన లేరనే విషయం నమ్మలేకపోతున్నానని, ఆయనతోపాటు చివరిసారిగా పర్వతారోహణను పంచుకున్న దేబాశిష్ విశ్వాస్ అనే మరో ఎవరెస్టు అధిరోహకుడు చెప్పారు.

మరిన్ని వార్తలు