కంచీపురం: తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. పర్యాటకానికి వచ్చిన ఓ జర్మనీ మహిళా టూరిస్టుపై లైంగిక దాడి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం శనివారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 38 ఏళ్ల జర్మనీ మహిళ తమిళనాడులోని మహాబలిపురంలో పర్యటించేందుకు వచ్చింది.
ఉదయం 10.30గంటల ప్రాంతంలో కాస్తంత నిర్మానుష్యంగా అనిపించే టైగర్ కేవ్స్ వైపు వెళ్లి అక్కడ బీచ్లో సన్ బాత్ చేయడం మొదలుపెట్టింది. ఆ సమయంలోనే అటువైపు వచ్చిన ఓ వ్యక్తి తొలుత ఆమెను లైంగికంగా వేధించి అనంతరం లైంగికదాడి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని వైద్యపరీక్షలకు తరలించి విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.