త్వరలో తొలి రైల్వే యూనివర్సిటీ: మోదీ

22 Oct, 2016 15:54 IST|Sakshi
త్వరలో తొలి రైల్వే యూనివర్సిటీ: మోదీ

వడోదర(గుజరాత్): వడోదర ఎయిర్ పోర్టులో అంతర్జాతీయ టెర్మినల్ను ప్రధాని నరేంద్రమోదీ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విమానయాన రంగం అభివృద్ధి కోసం కొత్త పాలసీ తీసుకు వచ్చామన్నారు. కేరళలోని కొచ్చి, గుజరాత్లోని వడోదరలో గ్రీన్ ఎయిర్ పోర్ట్లు పర్యావరణ అనుకూలంగా ఉన్నాయని తెలిపారు.

ప్రపంచంలో ఎంతో అధునికత వస్తోందని, రైళ్లలో కొత్త సాంకేతికత తీసుకొస్తామని చెప్పారు. త్వరలో వడోదరలో తొలి రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.

మరిన్ని వార్తలు