తొమ్మిది మందికి ఐపీఎస్ ఖరారు

20 Mar, 2015 03:08 IST|Sakshi
తొమ్మిది మందికి ఐపీఎస్ ఖరారు

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లోని పోలీసు విభాగాల్లో పని చేస్తున్న తొమ్మిది మంది రాష్ట్ర పోలీసు సర్వీసు అధికారులకు ఐపీఎస్ హోదా ఖరారు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొంది. 2011, 2012, 2013 ప్యానల్ ఇయర్స్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో పని చేస్తున్న వారు ఈ జాబితాలో ఉన్నారు.

జె.బ్రహ్మారెడ్డి, జె.మురళీధర్, ఎం.సుబ్బారావు, ఎల్‌ఎస్ చౌహాన్, ఆర్‌ఎన్ అమ్మిరెడ్డి, కె.నారాయణ్‌నాయక్, పీహెచ్‌ఎన్ జాకోబ్, బి.అనంతశర్మ, ఎస్.రంగారెడ్డి ఐపీఎస్ ఖరారైన వారిలో ఉన్నారు

మరిన్ని వార్తలు