ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు

18 Dec, 2014 10:24 IST|Sakshi

న్యూఢిల్లీ:  జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ నింగిలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. 'జీఎస్ఎల్వీ మార్క్ -3 రాకెట్ ప్రయోగం సక్సెస్ అయినందుకు సంతోషం. ఈ విజయానికి కృషి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు'అంటూ మోదీ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో గురువారం ఉదయం 9.30 గంటలకు నింగిలోకి వెళ్లిన  జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ రాకెట్ పైభాగంలో మూడు వేల కిలోల కంటే బరువైన క్రూ మాడ్యూల్‌ (వ్యోమగాముల గది)ను ఇస్త్రో శాస్త్రవేత్తలు అమర్చి విజయవంతంగా ప్రవేశపెట్టారు.

 630. 58 టన్నులు బరువు ఉన్న ఈ రాకెట్  ప్రయోగానికి రూ.155 కోట్ల వ్యయం అయ్యింది. 3,735 కిలలో బరువు, 43.43 మీటర్ల ఎత్తు ఉన్న వ్యోమగాముల గదిని ఈ రాకెట్ నింగిలోకి తీసుకెళ్లింది.విష్యత్తులో మన దేశం నుంచే అత్యంత బరువైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే క్రమంలోనే జీఎస్ఎల్ వీ మార్క్-3 ని ప్రయోగించింది.

మరిన్ని వార్తలు