ఛత్తీస్‌లో ఎస్‌యూవీని పేల్చిన నక్సల్స్‌

21 Mar, 2019 05:03 IST|Sakshi

చర్ల/బీజాపూర్‌: ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌ ఓ పౌరుడి కారును పేల్చేశారు. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. బీజాపూర్‌ జిల్లాలో బుధవారం ఈ ఘటన జరిగింది. పెద్దకోడెపాల్‌ గ్రామ సమీపంలో ఉదయం 7.45 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. దంతెవాడ జిల్లాలో జరుగుతున్న ఓ తిరునాలకు ఎస్‌యూవీలో వెళ్తుండగా నక్సల్స్‌ దానిని పేల్చేశారు. బీజాపూర్‌ సూపరింటెండెంట్‌ గోవర్ధన్‌ రామ్‌ ఈ వివరాలను వెల్లడించారు. 

మరిన్ని వార్తలు