మన దేశం శుభ్రంగా ఉండాలా.. చెత్తగా ఉండాలా మీరే చెప్పండి అని ప్రధాని నరేంద్రమోదీ మథుర వాసులను ప్రశ్నించారు. తన ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన సందర్భంగా మథురలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన స్వచ్ఛభారత్ కార్యక్రమం గురించి విశేషంగా చెప్పారు. ఆయనేమన్నారంటే..
-
మన దేశం శుభ్రంగా ఉండాలా.. చెత్తగా ఉండాలా?
-
ఇంటి చుట్టూ చెత్త ఉండటం వల్లే రోగాలు వస్తాయి.
-
దాంతో పిల్లాడు చనిపోతే.. కుటుంబం మొత్తం బాధపడుతుంది
-
ప్రతియేటా ఒక్కో కుటుంబానికి చెత్త వల్ల 7వేలరూపాయల వైద్యఖర్చులు అవుతున్నాయని ప్రపంచబ్యాంకు చెప్పింది
-
అందుకే మనం చెత్తను మన పరిసరాల నుంచి దూరం చేయాలి.
-
125 కోట్ల మంది దేశవాసులు ఈ ప్రతిజ్ఞ చేయాలి
-
ఈ పని కష్టమే గానీ, ప్రతి ఒక్కరూ చేయాలి.
-
మన భారతమాత చెత్తమయం అయిపోకూడదు.
-
మన గంగామాత, యమునా మాత చెత్తతో నిండిపోకూడదు
-
ఈ పనులన్నీ చేయడానికే వచ్చాం.. చేసి తీరుతాం. అందుకు మీ సహకారం కావాలి, మీ ఆశీస్సులు కావాలి.
-
మా ఆశీస్సులు ఉంటే అన్ని పనులూ చేస్తాం.
-
పేదలకు నివసించడానికి పక్కా ఇళ్లు కావాలా.. వద్దా?
-
వాటిలో కరెంటు, సెప్టిక్ లెట్రిన్లు ఉండాలా.. అక్కర్లేదా?
-
రాబోయే ఏడేళ్లలో ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఇలాంటి సౌకర్యాలతో కూడిన సొంత ఇల్లు ఉండాలని సంకల్పం పెట్టుకున్నాను.