‘కిరాయిదారుల ఖాళీ’ కేసులకు ప్రాధాన్యం

31 Jul, 2017 01:00 IST|Sakshi
‘కిరాయిదారుల ఖాళీ’ కేసులకు ప్రాధాన్యం

న్యూఢిల్లీ: కిరాయిదారులను ఖాళీ చేయించడంలో వివాదం నెలకొన్న కేసులకు ప్రాధాన్యతనిచ్చి త్వరగా పరిష్కరించాలని సుప్రీంకోర్టు కిందికోర్టులకు సూచించింది. ఈ కేసులు దీర్ఘకాలం కొనసాగడం వల్ల స్థల యజమానులు  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంది. యజమాని ఆ స్థలాన్ని తన సొంత అవసరాలకు వాడుకోవటం కోసం అద్దెకున్న వారిని ఖాళీ చేయించే కేసులకు మరింత ప్రాధాన్యతనివ్వాలని పేర్కొంది. కేరళకు చెందిన, దశాబ్దానికి పైగా పెండింగ్‌లో ఉన్న ఇలాంటి ఓ కేసు విచారణలో ఈ వ్యాఖ్యలు చేసింది.

మరిన్ని వార్తలు