శ్రీనగర్: సరిహద్దుల్లో కాపలా విధులు నిర్వర్తిస్తున్న ఓ సైనికుడు సెల్ఫోన్ వాడొద్దని చెప్పిన పై అధికారిని కాల్చి చంపాడు. ఈ ఘటన భారత్-పాక్ సరిహద్దుల్లోని యూరి సెక్టార్లో చోటుచేసుకుంది. ఎల్వోసీ వెంట డ్యూటీలో ఉన్న ఓ సిపాయి సెల్ఫోన్లో మాట్లాడటంపై మేజర్ శేఖర్ థాపా అభ్యంతరం తెలిపారు. అయితే, ఆ జవాను ఆయన ఆదేశాల్ని లెక్కచేయలేదు. సదరు సిపాయి పదేపదే ఆజ్క్షల్ని ఉల్లంఘించటంపై ఇద్దరి మధ్యా వాదులాట జరిగింది.
కోపంతో ఉన్న ఆ జవాను శేఖర్ను తన వద్ద ఉన్న తుపాకీతో పలుమార్లు కాల్పులు జరిపాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన మేజర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన అనంతరం ఆ జవానును అదుపులోకి తీసుకుని, విచారణ చేపట్టారు. కుటుంబం నుంచి ఎక్కువగా కాలం దూరంగా ఉంచటం, పనిభారం, సౌకర్యాల లేమి తదితర కారణాలతో జవాన్లు సహనం కోల్పోయి పై అధికార్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం కాల్పులు జరపటం వంటివి ఇక్కడ తరచూ జరుగుతున్నాయి.