ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి

8 Aug, 2016 14:08 IST|Sakshi
ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి

కుప్వారా: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య సోమవారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కుప్వారా జిల్లాలోని మచిల్ సెక్టార్లో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందారు. ఉగ్రవాదుల సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలపై ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డారని.. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందినట్లు ఆర్మీ అధికారి వెల్లడించారు. ఈ ఘటనలో ఓ టెర్రరిస్టు సైతం మృతి చెందినట్లు తెలిపారు. ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మరోవైపు కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ, ఆంక్షలు కొనసాగుతున్నాయి.
 

>
మరిన్ని వార్తలు