సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ను కట్టడి చేయటానికి విధించిన లాక్డౌన్తో కుదేలయిన ఆర్థిక రంగ పునరుత్తేజం, స్వావలంబ భారత్ లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజ్కు సంబంధించిన మరిన్ని వివరాలను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శనివారం వెల్లడించారు. తీవ్ర పోటీని ఎదుర్కొనే విధంగా మనల్ని మనం తయారు చేసుకోవాల్సి ఉందని ఆమె అన్నారు. వ్యవస్థలను బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్భుతమైన సంస్కరణలు చేపట్టారన్నారు. ప్రత్యక్ష పెట్టుబడుల్లో తీసుకువచ్చిన సంస్కరణలు అద్భుతమైన ఫలితాలనిస్తున్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. ( అనుబంధ వ్యవ‘సాయా’నికి! )
తమ ప్రభుత్వ హయాంలోనే జీఎస్టీకి మోక్షం లభించిందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. నేడు ప్రధానంగా నిర్మాణాత్మక సంస్కరణలకు ప్రాధాన్యమిస్తున్నామని, పెట్టుబడులను వేగవంతం చేసేందుకు విధానపరమైన సంస్కరణలు చేపట్టామన్నారు. పారిశ్రామిక రంగంలో మౌళిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. భూ బ్యాంకుల ఏర్పాటుతో పాటు పారిశ్రామిక క్లస్టర్ల గుర్తించామన్నారు. 5 లక్షల హెక్టార్లలో 3376 ఇండస్ట్రియల్ పార్కుల గుర్తింపు, బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రైవేటు రంగానికి అవకాశం ఇవ్వనున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
నిర్మల ప్రసంగంలోని మరికొన్ని అంశాలు..