ఆపరేషన్ చేసినా గర్భం.. లేడీ డాక్టర్కు భారీ ఫైన్

15 Jul, 2016 14:21 IST|Sakshi
ఆపరేషన్ చేసినా గర్భం.. లేడీ డాక్టర్కు భారీ ఫైన్

ముజఫర్నగర్: నిర్లక్ష్యం కారణంగా ఓ వైద్యురాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. తాను నిర్వహించిన ఆపరేషన్ విషయంలో ఆశ్రద్ధగా వ్యవహరించడంపట్ల ఓ మహిళ వినియోగదారుల కోర్టు మెట్లెక్కడంతో సమస్యల్లో ఇరుక్కుంది. బాధితురాలికి రూ.1,12,000 ఫైన్ చెల్లించాల్సి వచ్చింది.

తనకు పిల్లలు పుట్టకుండా ఉండేందుకు ముజఫర్ నగర్ జిల్లాకు చెందిన సునీతా దేవీ అనే మహిళ శస్త్ర చికిత్స చేయించుకుంది. 2013లో ఆమె ఈ ఆపరేషన్ చేయించుకోగా తాజాగా ఆమె గర్భం దాల్చింది. దీంతో వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగా తాను మరోసారి తల్లి కావాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తూ కంజ్యూమర్ కోర్టును ఆశ్రయించగా డాక్టర్ మంజు అగర్వాల్ అనే వైద్యురాలికి కోర్టు రూ.లక్షకుపైగా ఫైన్ వేసింది.

మరిన్ని వార్తలు