కౌలాలంపూర్ - తిరుచురాపల్లి నగరాల మధ్య ప్రతిరోజు విమాన సర్వీసులు నడపనున్నట్లు మలేషియాలోని ఎయిర్ ఆసియా ఎయిర్ లైన్స్ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆ విమాన సర్వీస్ ఆగస్టు 30 నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపింది. కాగా ఈ రెండు నగరాల మధ్య ప్రస్తుతం రెండు విమాన స్వరీసులు ప్రతిరోజు నడుస్తున్న సంగతిని ఎయిర్ ఆసియా గుర్తు చేసింది. ఈ విమాన సర్వీసుల వల్ల ఇరు దేశాల వారికి మరింత ప్రయోజనం కలుగుతుందని ఎయిర్ ఆసియా ఆశాభావం వ్యక్తం చేసింది.