టీఏజీసీ,ఆటా ఆధ్వర్యంలో 'షికాగో చాంపియన్ ట్రోఫీ'

10 Jul, 2013 16:03 IST|Sakshi
తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ షికాగో, అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో 'షికాగో చాంపియన్ ట్రోఫీ' పోటీలు జరిగాయి.

తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ షికాగో (టీఏజీసీ), అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) సంయుక్తంగా నిర్వహించిన 'షికాగో చాంపియన్ ట్రోఫీ' పోటీలు నేపర్ విల్లా కమిషనర్స్ పార్క్లో శని, ఆదివారాల్లో జరిగాయి. ఈ పోటీల్లో మొత్తం ఎనిమిది జట్టులు పాల్గొన్నాయి. అయితే తుదిపోరుకు శ్రీనివాస్ వేమూరి నేతృత్వంలోని చాలెంజర్స్ జట్టుతో కళ్యాణ్ ఆనందుల నేతృత్వంలోని డెక్కన్ వారియర్స్ జట్టు తలడింది. తుదకు 42 పరుగుల అధిక్యంతో చాలెంజర్స్ జట్టు విజయాన్నిసొంతం చేసుకుంది. అయితే చాలెంజర్స్ జట్టుకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కింద 500 అమెరికన్ డాలర్లు విలువ గల టిక్కెట్లను అందజేస్తామని ఆటా,టీఏజీసీ లు తెలిపాయి.

 

వచ్చే ఏడాది జూలై 4న జరగనున్న 14వ ఆటా మహాసభల్లో వీటిని ఆందజేస్తాని తెలిపింది.  న్యూయార్క్ లైఫ్ ఇన్సూరెన్స్కు చెందిన కృష్ణ రంగరాజు ఈ క్రికెట్ పోటీల ఏర్పాటుకు సహకరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంత చేసినందుకు కళ్యాణ్ ఆనందుల, పద్మకర్ దామరాజు, సాయి రవి సురిబొట్ల, రాం ఆది, ఆంజి కందిమళ్ల, సుజాత అప్పలనేని, సంధ్య అప్పలనేనిలకు స్పోర్ట్స్ కమిటీ చైర్మన్ ప్రదీప్ కందిమళ్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు