153వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

5 May, 2018 09:07 IST|Sakshi

సాక్షి, మచిలీపట్నం : ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 153వ రోజు శనివారం మచిలీపట్నం నియోజవకర్గంలోని బుద్ధాలపాలెం నుంచి ప్రారంభమైంది.

బంటుమిల్లి క్రాస్‌ రోడ్డు మీదుగా పెడన నియోజకవర్గంలోకి వైఎస్‌ జగన్‌ ప్రవేశిస్తారు. అక్కడి నుంచి తోటమాల తర్వాత పెడన చేరుకుంటారు. పెడన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కొంకెపూడి వరకు పాదయాత్రను కొనసాగిస్తారు.

మరిన్ని వార్తలు