రూ. 3000 నిరుద్యోగ భృతి : ఉత్తమ్‌

17 Apr, 2018 20:28 IST|Sakshi
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

సాక్షి, మణుగూరు : తమ పార్టీ అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నెలకు 3000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతినిస్తామని తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హామీయిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో మంగళవారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. వరి మొక్క జొన్నలు, సజ్జలు,  రెండువేల రూపాయల మద్ధతు ధర ఇస్తామన్నారు.

పత్తికి రూ. 6000, మిర్చికి రూ. 10 వేలకు పైగా మద్దతు ధరను కల్పిస్తామన్నారు. డ్వాక్రా మహిళలకు పది లక్షల రూపాయల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తామని హామీయిచ్చారు.

మరిన్ని వార్తలు