కృష్ణపట్నం పోర్టులో లాభార్జన కోసమే..

22 Jan, 2018 16:18 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కృష్ణపట్నం పోర్టులో లాభార‍్జన కోసమే చంద్రబాబు నాయుడు దుగరాజుపట్నం పోర్టును వదులుకున్నారని వైఎస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. సంపాదనే లక్ష్యంగా ఏపీ మంత్రివర్గ నిర్ణయాలు ఉంటున్నాయన్నారు. స‍్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని అంబటి తీవ్రస్థాయిలో ధ‍్వజమెత్తారు. కీలక ప్రాజెక్ట్‌ల విషయంలో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవడం లేదని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు