ధర్నాచౌక్‌పై నిషేధం ఎత్తేయాలి: చాడ

4 Aug, 2018 00:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నాచౌక్‌పై నిషే ధాన్ని ఎత్తేయాలని ధర్నాచౌక్‌ పరిరక్షణ కమిటీ డిమాండ్‌ చేసింది. శుక్రవారం మగ్దూమ్‌భవన్‌లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అధ్యక్షతన ధర్నాచౌక్‌ పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది. ధర్నాచౌక్‌పై నిషేధాన్ని  ఎత్తివేయాలని కోరు  తూ ఈ నెల 11న సదస్సు నిర్వహిస్తామని వెల్లడించారు. రాష్ట్ర గవర్నర్, సీఎం, సీఎస్‌లకు వినతిపత్రాలను ఇస్తామన్నారు.

మరిన్ని వార్తలు