-
ఇందిరాపార్క్ ధర్నాచౌక్ లో కాంగ్రెస్ ధర్నా
-
మంత్రి పదవి ఇవ్వకుంటే ధర్నాచౌక్లో ధర్నా చేస్తారట సార్!
మంత్రి పదవి ఇవ్వకుంటే ధర్నాచౌక్లో ధర్నా చేస్తారట సార్! -
బీజేపీ ఉపవాస దీక్షలో ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగుల సమస్యపై తెలంగాణ బీజేపీ తలపెట్టిన ఉపవాస దీక్షలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద దీక్షకు సమయం మించి పోవడంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అక్కడి నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. బీజేపీ కార్యాలయంలో దీక్ష కొనసాగించేందుకు సిద్ధం కాగా.. పార్టీ శ్రేణులు అందుకు తగ్గట్లుగా చర్యలు చేపట్టాయి. ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద బుధవారం బీజేపీ చేపట్టిన 24 గంటల ఉపవాస దీక్ష భగ్నం అయ్యింది. దీక్షను భగ్నం చేసిన పోలీసులు.. కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు తీసుకెళ్లే క్రమంలో కిషన్రెడ్డి సొమ్మసిల్లిపడి పోయారు. ఆ తర్వాత ఆయన్ని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తరలించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. బుధవారం ధర్నా చౌక్ వద్ద బీజేపీ 24 గంటల ఉపవాస దీక్ష చేపట్టింది. కిషన్రెడ్డి నేతృత్వంలో.. కేసీఆర్ సర్కార్పై విమర్శలపరంపరతో సాయంత్రం దాకా గడిచింది. అయితే సాయంత్రం ఆరు దాటగానే.. దీక్షా సమయం ముగిసిందని పోలీసులు శిబిరం వద్దకు చేరుకున్నారు. ఖాళీ చేసి వెళ్లిపోవాలని బీజేపీ నేతలకు సూచించారు. అయితే ఇది 24 గంటల దీక్ష అని.. తెల్లవారు దాకా దీక్ష చేసి తీరతానని కిషన్రెడ్డి భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో పోలీసులు ఆయనతో చాలాసేపు సంప్రదింపులు జరిపారు. ఈలోగా దీక్షా శిబిరాన్ని చుట్టుముట్టిన పోలీసులు.. అక్కడున్నవాళ్లను బయటకు పంపించే యత్నం చేశారు. కిషన్రెడ్డి మాత్రం లిఫ్ట్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఆ సమయంలో బీజేపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయినా దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయడానికి కిషన్రెడ్డి ఒప్పుకోలేదు. దీంతో రూల్స్ ప్రకారం గడువు ముగిసినా దీక్ష చేస్తున్నారనే కారణంతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. -
బీజేపీ మహాధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ మహాధర్నాకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు(మంగళవారం) హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేసుకోవచ్చని తెలిపింది. కాగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణంలో ప్రభుత్వ వైఫల్యంపై తెలంగాణ బీజేపీ నేతలు ఈనెల 25న ఇందిరాపార్క్ వద్దనున్న ధర్నాచౌక్లో నిరసనకు పిలుపునిచ్చింది. అయితే అనుమతి కోసం హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ను బీజేపీ నేతలు సంప్రదించగా.. ఈ ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. నేడు న్యాయస్థానంలో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దీనిపై మధ్యాహ్నం హైకోర్టు విచారణ జరిపింది. ధర్నాకు అనుమతి ఇస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ప్రభుత్వ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే కేంద్రం ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు శాంతి భద్రతల విఘాతం కలగలేదా? అని హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం ధర్నా చేసినప్పుడు లా అండ్ ఆర్డర్ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించింది.. 5వేల మందికి మీరు భద్రత కల్పించలేకపోతే ఎలా అని పోలీసులపై మండిపడింది. బీజేపీ మహాధర్నాకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపింది. చదవండి: TSPSC: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో కీలక పరిణామం -
నవ్వుల పువ్వుల తోటమాలి
‘ధర్నా దుర్గ’ గా సోషల్ మీడియాలో పాపులర్ అయిన దుర్గ ఏ ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయలేదు. సింగిల్ నినాదం కూడా చేయలేదు. అయితే ఆమె నవ్వులు మాత్రం ధర్నా చేయకపోయినా హల్చల్ చేస్తాయి. నాప్స్టాప్గా నవ్వేలా చేస్తాయి... ఫ్యామిలీ ఫంక్షన్లలో ఏం ఉన్నా లేకపోయినా, ఎవరు ఉన్నా లేక పోయినా దుర్గ ఉండాల్సిందే. ఎందుకంటే దుర్గ ఉన్నచోట ‘హాహాహో’లతో కూడిన భారీ నవ్వుల వర్షం కురుస్తుంది. ఆ నవ్వుల వర్షంలో తడిసిపోవడానికి చుట్టాలు పక్కాలు అమిత ఉత్సాహం చూపుతారు. ఆ నవ్వుల బలంతోనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్గా బోలెడు పేరు తెచ్చుకుంది దిల్లీకి చెందిన ధర్నా దుర్గ. నిజజీవితంలోని సంఘటనల చుట్టూ హాస్యాన్ని అల్లుకునే ధర్నా దుర్గకు సామాజిక మాధ్యమాలలో భారీ అభిమాన గణం ఉంది. హీరోయిన్ల గొంతును అనుకరించడం తన ప్రత్యేకత. సారా అలీఖాన్ గొంతును అద్భుతంగా అనుకరిస్తుంది. సారా ఫేవరెట్ డైలాగ్ ‘నమస్తే దర్శకో’పై ఫన్నీగా వీడియో చేసింది దుర్గ. ఈ వీడియో చూసి సారా అలీఖాన్ ముచ్చటపడడమే కాదు, దుర్గను మెచ్చుకుంటూ వీడియోను పోస్ట్ చేసింది. కరోనా కల్లోలంలో, ఇంటికే పరిమితం కావాల్సిన అనివార్యత వల్ల చాలామందిలాగే దుర్గ కూడా బోర్గా ఫీలైంది. దాని నుంచి బయటపడడానికి సెలబ్రిటీలను అనుకరిస్తూ సరదాగా వీడియోలు చేయడం ప్రారంభించింది. ఇవి తన స్నేహితులకు తెగ నచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. వాటికి అనూహ్యమైన స్పందన లభించేది. ఇక అప్పటినుంచి ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. తలపై ‘కామెడీ క్వీన్’ అనే కిరీటం వచ్చి చేరింది. ‘ఈ వీడియోలు ఏమిటో, లైక్లు ఏమిటో!’ అన్నట్లుగా ఆశ్చర్యంగా చూసేవారు దుర్గ తల్లిదండ్రులు. వారికి అన్నీ ఓపికగా చెప్పేది దుర్గ. తమ చుట్టాలు పక్కాలలో ‘ఫస్ట్ డిజిటల్ కంటెంట్ క్రియేటర్’గా తొలి గుర్తింపు తెచ్చుకుంది దుర్గ. నాటక రంగ నేపథ్యం ఉన్న దుర్గకు లోతైన పరిశీలన శక్తి ఉంది. అది తాను చేసే ఫన్నీ వీడియోలకు ఎంతో ఉపయోగపడుతుంది. రియాలిటీ షోలపై దుర్గ వేసే ఫన్నీ పంచ్లకు నవ్వు ఆపుకోవడం చానా కష్టం. ‘బిగ్ బాస్’లాంటి ప్రసిద్ధ రియాలిటీ షోల నుంచి క్యారెక్టర్లను అల్లుకొని ప్రేక్షకులను తెగ నవ్విస్తుంది. నృత్య నైపుణ్యం దుర్గ అదనపు బలం. కొరియోగ్రాఫర్లపై ఫన్నీ వీడియోలు చేస్తున్న క్రమంలో ఆమె చేసిన డ్యాన్స్ ఎంతోమందిని ఆకట్టుకుంది. ‘డ్యాన్సర్ ధర్నా దుర్గ’గా పేరు తెచ్చుకుంది. వేలాదిమందిని నవ్విస్తున్న ధర్నా దుర్గ... ‘నవ్విస్తే ఇంత పేరు వస్తుందని తెలియదు’ అంటోంది నవ్వుతూ!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కబ్జాపర్వం.. దందాలే సర్వం
పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
జగనన్న ఇచ్చిన వరం సొంతిల్లు
మద్యం దుకాణం సిబ్బందిపై కేసు నమోదు
అల్లూరితో మన్యంలో విప్లవ చైతన్యం
సంక్షేమ పాలనతో పేదల జీవితాల్లో వెలుగు
ఎగిరేది వైఎస్సార్ సీపీ జెండానే
No Headline
2019 తరువాత పరిస్థితి మారిపోయింది
సంక్షేమ సారథికి మరోసారి పట్టం కట్టండి
తప్పక చదవండి
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
Advertisement