రాహుల్ సభాస్థలిని పరిశీలించిన సీఎల్పి నేత

28 Mar, 2019 19:55 IST|Sakshi

సాక్షి, వనపర్తి : లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఏప్రిల్ 1న తెలంగాణలో పలు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. అందులో భాగంగా నాగర్ కర్నూల్ లోక్ సభ పరిధిలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు నిర్వహిస్తోంది. వనపర్తిలో నిర్వహిస్తున్న సభా ప్రాంగణాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు సందర్శించారు. సమావేశ ప్రాంగణం, జరుగుతున్న ఏర్పాట్లపై భట్టి విక్రమార్క మల్లు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనతో పాటు మాజీ మంత్రివర్యులు జీ చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు, ఏఐసీసీ సెక్రెటరీ సంపత్ కుమార్, నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి , మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ విప్ ఈరవత్రి అనిల్, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ జగదీశ్వర్ రావు తదితరులు ఉన్నారు.

ఒకేరోజులో రెండు సభల్లో పాల్గొననున్న రాహుల్‌.. 

ఏపీలో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార భరోసా సభలో ఒకే రోజు రెండు సభల్లో రాహుల్‌ గాంధీ పాల్గొనున్నట్లు మాజీ కేంద్రమంత్రి పళ్లం రాజు ప్రకటించారు. మార్చి 31న ఉదయం 11గంటలకు సింగ్ నగర్ లో మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొంటారు. అటుపై అదే రోజు సాయంత్రం అనంతపురం కళ్యాణదుర్గంలో మరో ఎన్నికల ప్రచార సభలో రాహుల్‌ గాంధీ పాల్గొంటారని తెలిపారు.

మరిన్ని వార్తలు