ఓట్ల కోసం హేమ మాలిని వరి కోతలు

1 Apr, 2019 09:45 IST|Sakshi

లక్నో : దేశమంతా సార్వత్రిక ఎన్నికల కోలాహలం నడుస్తోంది. ఎక్కడ చూసినా నేతల ప్రచారాలే దర్శనమిస్తున్నాయి. ఓటర్ల మన్ననలు పొందడానికి అభ్యర్థులు  పడరాని పాట్లు పడుతున్నారు. అలవాటు లేని పనులు చేస్తున్నారు. ఓటర్లు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. వినూత్నరీతిలో ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఓటర్ల మెప్పు పొందడం కోసం  ఒకప్పటి బాలీవుడ్‌ డ్రీమ్‌ గర్ల్‌, మధుర నియోజవర్గం బీజేపీ ఎంపీ అభ్యర్థి హేమమాలిని సినిమాటిక్ స్టైల్లో ప్రచారం చేస్తున్నారు. 

ఆదివారం ఎన్నికల ప్రచారం ప్రారంభించిన హేమ.. మహిళా ఓటర్లపై దృష్టి పెట్టారు. నియోజకవర్గంలోని గోవర్దన క్షేత్ర ప్రాంతంలో ప్రచారం నిర్వహించిన ఆమె.. దారిలో పొలాల వద్ద కనిపించిన మహిళా రైతులకు వద్దకు వెళ్లారు. కొడవలి చేతపట్టి వారితో పాటు వరి కోశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ‘ ఎన్నికల ప్రచారంలో భాగంగా గోవర్దన క్షేత్ర ప్రాంతంలోని మహిళలను కలుసుకున్నాను. మొదటి రోజు ప్రచారంలో పొలాల వద్ద ఉన్న మహిళతో కలిసి మాట్లాడడం అదృష్టంగా భావిస్తున్నాను’ అంటూ ఆ మహిళలతో దిగిన ఫోటోలను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
 

మరిన్ని వార్తలు