జేసీకి ‘కాక’ర్ల బ్రదర్స్‌

20 Mar, 2019 09:16 IST|Sakshi
వైఎస్సార్‌ సీపీ తరఫున ప్రచారం చేస్తున్న కాకర్లరంగనాథ్‌ తదితరులు

ఒక్కసారి మార్పును కోరుకుందాం 

వైఎస్సార్‌సీపీ గెలుపుతోనే తాడిపత్రిలో ప్రశాంతత 

సాక్షి, తాడిపత్రి అర్బన్‌: జేసీ సోదరుల పతనం ప్రారంభమైంది. ఇప్పటికే ఆ పార్టీలోని సీనియర్‌ నాయకులు ఒక్కొక్కరుగా దూరం కాగా.. సొంత ఊళ్లోనే వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడింది. తాజాగా వ్యతిరేక వర్గం కూడా కేతిరెడ్డి తరఫున ప్రచారం చేస్తూ ఒక్కసారి మార్పును కోరుకుందామని ప్రజలను కోరుతున్నారు. ఈ కోవలోనే కాకర్ల రంగనాథ్‌ సోదరులు మంగళవారం తాడిపత్రి మండలంలోని పలు గ్రామాల్లో వైఎస్సార్‌ సీపీ తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ‘‘తాడిపత్రి ప్రాంతంలో జేసీ సోదరుల అరాచకాలకు ఎక్కువయ్యాయి, వాటిని నిలువరించాలంటే వైఎస్సార్‌ సీపీ తాడిపత్రి అసెంబ్లీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి, అనంతపురం పార్లమెంట్‌ అభ్యర్థి తలారి పీడీ రంగయ్యకు ఓటు వేయండి..

అందరం ఒక్కసారి మార్పును కోరుకుందాం.. వైఎస్సార్‌ సీపీని గెలిపిద్దాం’’ అని ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మొదట హుస్సేనాపురం గ్రామానికి కేతిరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డితో పాటు వచ్చిన కాకర్ల సోదరులకు గ్రామస్తులు పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి ఘనస్వాగతం పలికారు. కేతిరెడ్డి హర్షవర్ధన్‌రెడ్డితో పాటు కాకర్ల రంగనాథ్‌ సోదరులు ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పైలా నరసింహయ్య, కాకర్ల రంగనాథ్‌ జగన్నాథ్‌(జయుడు) రంగనాయకులు, కేతిరెడ్డి సాయి ప్రతాప్‌రెడ్డి, జగ్గి సోదరులు జగదీశ్వర్‌రెడ్డి, కౌన్సిలర్‌ జయచంద్రారెడ్డి, చిత్తరంజన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు వెంకటేష్, రామ్‌శేఖర్, మాజీ కౌన్సిలర్‌ నాగరంగయ్య, డీఎన్‌ పెద్దయ్య, మోహన్‌రెడ్డి, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు