కేంద్ర నిధులు టీడీపీకి మళ్లింపు : కన్నా

3 Aug, 2018 21:01 IST|Sakshi
కన్నా లక్ష్మినారాయణ (ఫైల్‌ ఫోటో​)

సాక్షి, కృష్ణా : రాజకీయ లబ్ధికోసమే చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో అడ్డమైన హామీలన్నీ ఇచ్చారని ఏపీ బీజేపీ రాష్ట్రా అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని విమర్శించారు. దీక్షల పేరుతో కోట్ల రూపాయల దుబారాగా ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రం ఏపీకి ఇచ్చిన నిధులు మరే ఇతర రాష్ట్రానికి ఇవ్వలేదని, మోదీని దోషిగా చూపించడానికే చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర నిధులను మళ్లించి టీడీపీ నేతలు సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు.

>
మరిన్ని వార్తలు