అధికార దాహంతోనే పొత్తు: కేటీఆర్‌

10 Oct, 2018 02:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అధికార దాహంతోనే కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకున్నాయని మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటుకు రాత పూర్వకంగా అంగీకరించినందుకే వరుసగా 2004, 2009లలో కాంగ్రెస్, టీడీపీలతో టీఆర్‌ఎస్‌ పొత్తు పెట్టుకుందని అన్నారు. అవినీతి కాంగ్రెస్‌ నుంచి దేశాన్ని విముక్తి కలిగించడమే తమ లక్ష్యమని 2014లో పేర్కొన్న చంద్రబాబు.. నేడు అదే కాంగ్రెస్‌తో పొత్తు ఎలా పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్‌ను ఇటాలియన్‌ మాఫియారాజ్‌గా అభివర్ణించి ఇప్పుడే అదే కాంగ్రెస్‌తో ఎలా జతకట్టారని కేటీఆర్‌ మంగళవారం ట్విట్టర్‌లో ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు