ఏదో తెలియని రహస్యం ఉంది: భట్టి

29 Aug, 2018 02:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికలకు సీఎం కేసీఆర్‌  మొగ్గుచూపడం వెనుక ఏదో తెలియని రహస్యం ఉందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో లేదా కేసీఆర్‌ కుటుంబంలో ఏవో ఇబ్బందులు ఉండవచ్చని, అందుకే ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎంతో, ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లాలనే వ్యూహంతో కేసీఆర్‌ ఉన్నారని, అందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే మంచి దని ఆయన భావించి ఉంటారన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్‌ పార్టీనే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు