‘సీఎం వైఎస్‌ జగన్ నిజమైన బాహుబలి‌’

26 Jun, 2020 19:16 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: నారా లోకేష్ చౌదరికి, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించే సమయం లేదు గానీ, అవినీతికి పాల్పడిన టీడీపీ గజ దొంగలను మాత్రం పరామర్శించేందుకు వెళ్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ చురకలంటించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారని విమర్శించారు. పేదల కష్టార్జితాన్ని దోపిడీ చేసిన అచ్చెన్నాయుడు కుటుంబాన్ని పరామర్శించారని తెలిపారు. శుక్రవారం మంత్రి వెల్లంపల్లి పార్టీ కార్యాలయంలో మాట్లాడారు.

‘ఈఎస్ఐ స్కాంలో తన పేరు ఎక్కడ బయట పెడతారోననే భయంతో లోకేష్ అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిలువుగా, అడ్డంగా పెరిగితే బాహుబలి కాదు. ప్రజల సమస్యలను పరిష్కరించే సీఎం వైఎస్‌ జగన్ నిజమైన బాహుబలి. మీరందరూ కాలకేయుల్లాంటోళ్లు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దెబ్బకు టీడీపీ 23 స్థానాలకు పడిపోయింది. వైఎస్‌ రాజారెడ్డి గురించి మాట్లాడే అర్హత లోకేష్‌కు ఉందా. గతంలో ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే అరెస్టులు చెయలేదా.

లోకేష్‌ను కూడా టీడీపీ నేతలు పరామర్శించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మంగళగిరి మందలగిరికి, జయంతి వర్ధంతికి తేడా తెలియని వ్యక్తి లోకేష్. మాట్లాడితే అచ్చెన్నాయుడిని హత్య చేయాలని ప్రభుత్వం చూస్తోందని అంటున్నారు. హత్యలు చేసే సంస్కృతి టీడీపీది. వంగవీటి రంగను నడిరోడ్డుపై చంపిచింది ఎవరు? టీడీపీ అధికారంలో ఉన్నపుడే వంగవీటి రంగను హత్య చేయించలేదా..? హత్యా రాజకీయాలకు పేరు ప్రఖ్యాతులు గడిచింది నారా చంద్రబాబు’అని మంత్రి పేర్కొన్నారు.
(చదవండి: ఎవరి వాటా ఎంత?)
(అందరం కలిసికట్టుగా ఈ చీకటిపై పోరాడుదాం)

మరిన్ని వార్తలు