ప్రజాసంకల్పయాత్రకు రేపు, ఎల్లుండి విరామం

26 Oct, 2018 20:31 IST|Sakshi

సాక్షి, విజయనగరం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు రేపు, ఎల్లుండి విరామం ప్రకటించినట్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. నిన్న విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి నేపథ్యంలో గాయపడిన వైఎస్‌ జగన్‌ ఆరోగ్య పరిస్థితిపై శనివారం సాయంత్రం వైద్యులు పూర్తిస్ధాయి నివేదిక ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

వైద్యుల నివేదిక అందిన తరువాత వైద్యుల సూచనల మేరకు పాదయాత్ర ఎప్పుడు ప్రారంభిస్తారన్న విషయంపై స్పష్టమైన సమాచారం అందిస్తామని తలశిల రఘురాం తెలిపారు.

మరిన్ని వార్తలు