చంద్రబాబు ఇదిగో ఆధారాలు : పవన్‌ కల్యాణ్‌

6 Nov, 2018 13:27 IST|Sakshi

సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా మొత్తాన్ని తన కంట్రోల్‌లో పెట్టుకొని వాస్తవాలను బయటకు తెలియకుండా చేస్తున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. తితిలీ తుపానుపై తాను కేంద్రానికి లేఖ రాయలేదని చంద్రబాబు అబద్దాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.ఈ మేరకు తాను కేంద్రానికి రాసిన లేఖలను ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ చంద్రబాబు పై ధ్వజమెత్తారు.

సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఓ సభలో మాట్లాడుతూ.. తితిలీ తుపాను బాధితులను ఆదుకోవాలని పవన్‌ కల్యాణ్‌ ఒక్క లేఖ కూడా కేంద్రానికి రాయలేదని విమర్శించారు. ఉద్ధానం వచ్చి మొసలి కన్నీరు కార్చుతూ.. చాలా అన్యాయం జరిగిందన్న పవన్‌.. తుపాన్‌ బాధితుల గురించి కేంద్రానికి ఒక్క లేఖ అయినా రాశారా? విమర్శించారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. (దేవుడని మొక్కితే దెయ్యమై కూర్చున్నాడు)

చంద్రబాబు విమర్శలపై మంగళవారం పవన్‌ కల్యాణ్‌  ట్విటర్‌లో స్పందిస్తూ.. ‘  చంద్రబాబు గారు.. ఏపీలోని ఎలాక్ట్రానిక్‌ మీడియా మొత్తం మీ కంట్రోల్‌లో ఉంది. కావును జనసేన వార్తలను బయటకు రావు. అందుకే మీరు మమ్మల్ని ప్రజల్లో దూషింస్తున్నారు. నేను తితిలీపై కేంద్రానికి లేఖ రాయలేదని ప్రజలకు చెప్పారుగా.. ఇదితో ఆధారాలు ’  అంటూ ప్రధానమంత్రికి రాసిన లేఖలను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.  

మరిన్ని వార్తలు