కేసీఆర్‌కు ఇంటిపోరు

13 Jan, 2020 03:14 IST|Sakshi

సీఎం సీటుపై కేటీఆర్‌కు మోజు పెరిగింది

కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి సీటుపై మంత్రి కేటీఆర్‌కు మోజు పెరిగిందని, అందుకే మున్సిపల్‌ ఎన్నికలు తనకు పరీక్ష అని అంటున్నారని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం సీటు విషయంలో కేసీఆర్‌కు ఇంటిపోరు పెరిగిందని, డైనింగ్‌ టేబుల్‌ దగ్గర దీనిపై పంచాయితీ నడుస్తోందన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలతో కేటీఆర్‌ ఆశిస్తున్న సీఎం సీటుకు లింకు పెట్టారని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో పీసీసీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్యరెడ్డితో కలిసి రేవంత్‌ విలేకరులతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని ఏ మున్సిపాలిటీలోనూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో వచ్చిన మార్పేమీ లేదన్నారు. ఆరేళ్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీలోని ప్రభుత్వ భూములు యథేచ్ఛగా కబ్జా అయ్యాయని తెలిపారు.

మరిన్ని వార్తలు