టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం: చంద్రబాబు

19 Apr, 2019 15:25 IST|Sakshi

కర్నూలు జిల్లా: మళ్లీ టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు రాక్‌గార్డెన్‌లో చంద్రబాబు నాయుడు , టీడీపీ అభ్యర్థులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల పోలింగ్‌ సరళిపై అభ్యర్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అయితే ఈ సమావేశానికి కర్నూలు జిల్లాలో టీడీపీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు అఖిల ప్రియ, బుడ్డా రాజేశేఖర్‌ రెడ్డి, కేఈ శ్యాంబాబు, టీజీ భరత్‌, తిక్కారెడ్డి, మీనాక్షి నాయుడు, కేఈ ప్రతాప్‌లు గైర్హాజయ్యారు. సమావేశానికి వచ్చిన నాయకులతోనే వివరాలు అడిగి తెలుసుకుని అనంతరం ఎయిర్‌ పోర్టు నుంచి హెలికాప్టర్‌లో ఎన్నికల ప్రచారం నిమిత్తం కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లాకు సీఎం బయలుదేరి వెళ్లారు.

మరిన్ని వార్తలు