తప్పు చేసినా బహిష్కరించే ధైర్యం లేదు..

23 Jun, 2020 10:35 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో.. 'నాయకత్వం పట్ల అసంతృప్తితో ఉన్న ఒక ఎమ్మెల్యేని, బాబు గారి దూత కలిసి పార్టీని వదిలి వెళ్లొద్దని ప్రాధేయపడ్డాడట. తక్షణం 5 కోట్ల రూపాయలు అరేంజ్ చేశారట. ఇంకో పదేళ్లు పవర్ లేకపోయినా దేనికీ లోటు లేకుండా పార్టీని నడిపిస్తారని భరోసా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఖజానా దోచినోడికి ఇదో లెక్కా' అంటూ మండిపడ్డారు. చదవండి: మీ ఎమ్మెల్యేలే ఛీకొట్టి మీకు ఓటేయలేదు..

మరో ట్వీట్‌లో.. 'అధికారం కోల్పోయినా, పరివర్తన లేకుండా కుంభకోణాలు, నేరాలకు పాల్పడిన నేతలను వెనకేసుకు రావడం బాబుకే చెల్లింది. ప్రభుత్వ పొరపాట్లను ఎత్తిచూపాల్సిన ప్రతిపక్షం తనే ఆత్మరక్షణ ధోరణిలో పడటం విస్మయం కలిగిస్తోంది. తప్పు చేసినా బహిష్కరించే ధైర్యం లేదనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లిపోయాయి' అని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. చదవండి: కింద జాకీలు, పైన క్రేన్లతో ఆకాశానికి...

మరిన్ని వార్తలు