ముగిసిన విచారణ

23 Jun, 2020 10:33 IST|Sakshi
వైద్య పరీక్షల నిమిత్తం జేసీ ప్రభాకర్‌రెడ్డిని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్తున్న పోలీసులు

అనంతపురం క్రైమ్‌: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్‌రెడ్డిల విచారణ పూర్తయింది. బీఎస్‌ 3 అక్రమ వాహనాల రిజిస్ట్రేషన్‌లపై వన్‌టౌన్‌ పోలీసులు వారిని రెండ్రోజులు పోలీసు కస్టడీకి తీసుకున్న విషయం విధితమే. సోమవారం ఉదయం 9 గంటల వరకు వన్‌టౌన్‌ సీఐ ప్రతాప్‌రెడ్డి వారిని విచారించారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం సర్వజనాస్పత్రికి తీసుకెళ్లారు. తర్వాత న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఆ తర్వాత కస్టడీ పూర్తి కావడంతో  వారిద్దరినీ కడప జైలుకు తరలించారు.(జేసీ ట్రావెల్స్‌ కేసు.. కీలక విషయాలు)

>
మరిన్ని వార్తలు