267వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

22 Sep, 2018 08:07 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం వైఎస్‌ జగన్‌.. భీమిలి నియోజకవర్గంలోని పప్పలవానిపాలెం క్రాస్‌ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. అడుగడుగునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ జననేత ముందుకు సాగుతున్నారు. అక్కడి నుంచి కొలవానిపాలెం క్రాస్‌, భీమేంద్రపాలెం, ఎర్రవానిపాలెం క్రాస్‌, రామవరం మీదుగా గండిగుండం క్రాస్‌ వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగుతుంది.

మరిన్ని వార్తలు