సాక్షి, ఏలూరు : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. మంగళవారం ఉదయం వైఎస్ జగన్ ఏలూరు శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి మల్కాపురం, పాలెగూడెం, కొవ్వలి మీదుగా దెందులూరు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. జననేత మంగళవారం మధ్యాహ్నం దెందులూరు గ్రామంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.
ఇప్పటి వరకు వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రలో 2,008.9 కిలో మీటర్లు నడిచారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా భరోసానిస్తూ జననేత పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు.