77వ రోజు ముగిసిన ప్రజాసంకల్పయాత్ర

1 Feb, 2018 19:05 IST|Sakshi

మరుపూరు వద్ద ముగిసిన ప్రజాసంకల్పయాత్ర

సాక్షి, నెల్లూరు :  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 77వ రోజు ప్రజాసంకల్పయాత్ర ముగిసింది. మరుపూరు వద్ద ఆయన పాదయాత్రను ముగించారు. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు శివారు నుంచి వైఎస్‌ జగన్‌ గురువారం ఉదయం ప్రజాసంకల్పయాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే. అక్కడ నుంచి తోడేరు క్రాస్‌ రోడ్డు మీదుగా ఉప్పుటూరు క్రాస్‌ రోడ్డు చేరుకున్నారు. అనంతరం అక్కడ నుంచి చాటగట్ల చేరుకొని పార్టీ జెండా ఆవిష్కరించారు. ఆతర్వాత మరుపూరు వద్ద ప్రజాసంకల్పయాత్ర ముగిసింది.

అంతకు ముందు వైఎస్‌ జగన్‌ను వీఆర్‌ఏలు కలిశారు. చాలీచాలని వేతనాలతో తాము అనేక కష్టాలు పడుతూ ఉద్యోగాలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు ఆరువేల జీతంతో అనేక విధులు నిర్వహిస్తున్నామని, తాము వెట్టి చాకిరి చేస్తున్నట్లుగానే ఉందని వీఆర్‌ఎలు జననేత వద్ద తమ గోడు వెలిబుచ్చుకున్నారు. ఏపీ వీఆర్‌ఏ అసోసియేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మేరిగ రమేష్, జిల్లా కార్యదర్శి సుబ్రహ్మణ్యం తదితరులు వైఎస్‌ జగన్ను కలిసి సమస్యలపై  వినతి పత్రం అందించారు.

మరిన్ని వార్తలు