న్యూఢిల్లీ: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్లో హైదరాబాద్ హంటర్స్కు మరో పరాజయం ఎదురైంది. శుక్రవారం ఇక్కడ జరిగిన పోరులో అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ 4–3 తేడాతో హంటర్స్పై గెలుపొందింది. మహిళల సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్తో పాటు ఒక పురుషుల సింగిల్స్ మ్యాచ్లో అహ్మదాబాద్ విజయం సాధించగా... పురుషుల డబుల్స్లో, మరో పురుషుల సింగిల్స్లో హైదరాబాద్ గెలిచింది. ముందుగా మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్లో స్మాష్ మాస్టర్స్ జోడీ కేఆర్ జుల్–ఎల్సీహెచ్ రెగినాల్డ్ 4–15, 15–12, 15–8 స్కోరుతో హంటర్స్ జంట బెర్నాడెత్–సాత్విక్ సాయిరాజ్ ఓడించింది. ఆ తర్వాత పురుషుల సింగిల్స్లో హైదరాబాద్ ఆటగాడు లీ హ్యూన్ 15–9, 15–11తో సౌరభ్ వర్మపై ఘన విజయం సాధించాడు.
మహిళల సింగిల్స్లో తై జు యింగ్ 15–5, 15–6తో రసిక రాజేను ఓడించి స్మాషర్స్ను ముందంజలో నిలిపింది. ఆ తర్వాత పురుషుల సింగిల్స్లో అహ్మదాబాద్ ట్రంప్ మ్యాచ్ ఆడిన ప్రణయ్ 15–10, 15–8తో సాయిప్రణీత్ను ఓడించి తమ జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. నామమాత్రమైన చివరి పురుషుల డబుల్స్ మ్యాచ్ హంటర్స్కు ట్రంప్ మ్యాచ్గా మారింది. ఇందులో హైదరాబాద్ జంట మార్కిస్ కిడో–యూ యెన్ సియోంగ్ 15–14, 15–11తో స్మాష్ ద్వయం రెగినాల్డ్–కిడాంబి నందగోపాల్ను ఓడించినా లాభం లేకపోయింది.