రాజస్తాన్‌ రాయల్స్‌ మెంటార్‌గా వార్న్‌

14 Feb, 2018 04:15 IST|Sakshi
షేన్‌ వార్న్‌

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా మాజీ స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌... ఐపీఎల్‌ ఫ్రాంచైజీ రాజస్థాన్‌ రాయల్స్‌ మెంటార్‌గా నియమితుడయ్యాడు. రెండేళ్ల నిషేధం అనంతరం ఈ సీజన్‌లో బరిలో దిగుతున్న రాయల్స్‌... తొలి ఐపీఎల్‌ (2008) టైటిల్‌ను వార్న్‌ కెప్టెన్సీ, కోచింగ్‌లోనే గెల్చుకుంది. ‘నా క్రికెట్‌ ప్రయాణంలో రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఉత్సాహవంతులైన, యువకులతో కూడిన జట్టుతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని ఈ మేటి లెగ్‌ స్పిన్నర్‌ తెలిపాడు.

మరిన్ని వార్తలు