అహ్మదాబాద్‌ పరాజయం 

31 Dec, 2018 04:01 IST|Sakshi

 చెన్నై స్మాషర్స్‌ ఘన విజయం 

పుణే: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌లో చెన్నై స్మాషర్స్‌ ఏకపక్ష విజయాన్ని సాధించింది. 6–(–1)తో అహ్మదాబాద్‌ స్మాష్‌మాస్టర్స్‌ను చిత్తుగా ఓడించింది. పురుషుల సింగిల్స్‌లో వీ ఫెంగ్‌ చోంగ్‌ (చెన్నై) 8–15, 15–14, 15–9తో సౌరభ్‌ వర్మపై గెలుపొందగా, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో క్రిస్‌ అడ్‌కాక్‌–గాబ్రియేలా అడ్‌కాక్‌ ద్వయం 15–14, 15–13తో సాత్విక్‌ సాయిరాజ్‌–సిక్కి రెడ్డి జంటను ఓడించింది. అహ్మదాబాద్‌ ట్రంప్‌ మ్యాచ్‌ అయిన పురుషుల సింగిల్స్‌ రెండోలో రాజివ్‌ ఉసెఫ్‌ (చెన్నై) 15–12, 7–15, 15–13తో మాజీ నంబర్‌వన్‌ విక్టర్‌ అక్సెల్‌సన్‌కు షాకిచ్చాడు. మహిళల సింగిల్స్‌ను చెన్నై ట్రంప్‌ మ్యాచ్‌గా ఎంచుకోగా సుంగ్‌ జీ హున్‌ 15–11, 15–9తో కిర్‌స్టీ గిల్మోర్‌ (అహ్మదాబాద్‌)ను చిత్తుగా ఓడించింది. పురుషుల డబుల్స్‌లో క్రిస్‌ అడ్‌కాక్‌–సుమీత్‌ రెడ్డి జంట (చెన్నై) 15–11, 15–12తో సాత్విక్‌ సాయిరాజ్‌–రెగినాల్డ్‌ ద్వయంపై నెగ్గింది. మరో పోరులో బెంగళూరు రాప్టర్స్‌ 4–3తో పుణే సెవెన్‌ ఏసెస్‌పై నెగ్గింది. నేడు జరిగే మ్యాచ్‌లో అవ«ద్‌ వారియర్స్‌తో ముంబై రాకెట్స్‌ తలపడుతుంది.

మరిన్ని వార్తలు