క్రిస్‌సిటీ నిర్మాణానికి దిగ్గజ సంస్థల పోటీ

12 Nov, 2023 05:20 IST|Sakshi

తుది బిడ్డింగ్‌ పోరులో నిలిచిన 3 ప్రముఖ నిర్మాణ సంస్థలు

రూ.1,021 కోట్లతో ‘క్రిస్‌’సిటీ నిర్మాణానికి ఏపీఐఐసీ టెండర్లు 

కృష్ణపట్నం వద్ద తొలిదశలో క్రిస్‌ సిటీ కింద 2,500 ఎకరాల అభివృద్ధి

సాక్షి, అమరావతి: చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో కృష్ణపట్నం వద్ద అభివృద్ధి చేయనున్న పారిశ్రామిక నగరం ‘క్రిస్‌’సిటీ నిర్మాణానికి దిగ్గజ సంస్థలు పోటీపడుతున్నాయి. తొలిదశలో రూ.1,5­03.16 కోట్లతో 2,500 ఎకరాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులివ్వడంతో ఈపీసీ విధానంలో రూ.1,021.41 కోట్ల విలువైన పనులకు టెండర్లు ఆహ్వానించింది. తుది బిడ్డింగ్‌లో మూడు కీలక సంస్థలు అర్హత సాధించినట్లు ఏపీఐ­ఐసీ వీసీఎండీ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

ప్రస్తుతం ఈ టెండర్ల మదింపు జరుగుతోందని, అర్హత సాధించిన తర్వాత వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించే విధంగా ప్రణాళికలు సిద్ధంచేసినట్లు ఆయన తెలి­పారు. చెన్నై–బెంగళూరు కారిడార్‌లో భాగంగా కృష్ణపట్నం వద్ద 10,834.5 ఎకరాల్లో పారిశ్రామిక పా­ర్కును రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.

ఇందు­కోసం కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్‌ ఇండ­స్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇంప్లిమెంటేషన్‌ ట్రస్ట్‌ (నిక్‌డిక్ట్‌)తో కలిసి ఏపీఐఐసీ నిక్‌డిక్ట్‌–­కృష్ణపట్నం ఇండస్ట్రియల్‌ సిటీ డెవలప్‌మెంట్‌ లిమి­టెడ్‌ (క్రిస్‌సిటీ) పేరుతో ప్రత్యేక కంపెనీని ఏర్పాటు­చేసింది. పూర్తిస్థా­యిలో తొలిదశ అందుబాటులో­కొ­స్తే 78,900 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.  

మరిన్ని వార్తలు