ధోని సేన కొత్త రికార్డు

20 Apr, 2018 21:21 IST|Sakshi

పుణె: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కొత్త రికార్డు సృష్టించింది. తాజా సీజన్‌లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 13.0 ఓవర్లలో 150 పరుగుల మార్కును చేరింది. ఫలితంగా తక్కువ ఓవర్లలో 150 పరుగుల మార్కును చేరిన తన గత రికార్డును చెన్నై సవరించింది. 2010 లో రాజస్తాన్‌ రాయల్స్‌పై 13.5 ఓవర్లలో ఈ ఘనతను చేరగా, 2015లో ముంబై ఇండియన్స్‌పై 13.1 ఓవర్లలో 150 పరుగుల మార్కును చేరింది. తాజాగా ఆ రెండు రికార్డులను చెన్నై అధిగమించింది.

టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ రాయల్స్‌ తొలుత చెన్నైను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో చెన్నై ఇన్నింగ్స్‌ను అంబటి రాయుడు, షేన్‌ వాట్సన్‌లు ఆరంభించారు. జట్టు 50 పరుగుల వద్ద రాయుడు(12) ఔట్‌ కాగా, షేన్‌ వాట్సన్‌ మాత్రం రెచ్చిపోయాడు. సురేశ్‌ రైనా(46)తో కలిసి రెండో వికెట్‌కు 86 పరుగుల్ని జత చేశాడు. ఈ క్రమంలోనే వాట్సన్‌ హాఫ్‌ సెంచరీ నమోదు చేసుకున్నాడు. వీరిద్దరూ చెన్నై స్కోరు బోర్డును పరుగులు పెట్టించడంతో చెన్నై 10 ఓవర్లలోనే వికెట్‌ నష్టానికి 107 పరుగులు చేసింది.

మరిన్ని వార్తలు