ఐపీఎల్‌-12: టాస్‌ గెలిచిన సీఎస్‌కే

23 Mar, 2019 19:33 IST|Sakshi

చెన్నై:ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-12వ సీజన్‌లో భాగంగా ఇక్కడ చిదంబరం స్టేడియంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరుగుతున్న ఆరంభపు మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ముందుగా ఆర్సీబీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇది తొలి మ్యాచ్‌ కావడంతో ఇరు జట్లు స్వేచ్ఛగా ఆడేందుకు సమాయత్తమయ్యాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి సీజన్‌ను విజయంతో ఆరంభించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి.
(ఇక్కడ చదవండి: కోహ్లి ముంగిట ‘హ్యాట్రిక్‌’ రికార్డులు)

డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ నాలుగోసారి టైటిల్‌పై కన్నేసింది. గత ఏడాది టీమ్‌ను గెలిపించిన ‘ప్రధాన బృందం’ మొత్తం ఈసారి కూడా కొనసాగుతోంది. టీమిండియాకు కెప్టెన్‌గా తిరుగు లేని విజయాలు అందిస్తున్న విరాట్‌ కోహ్లికి మాత్రం ఐపీఎల్‌ టైటిల్‌ లోటుగా ఉండిపోయింది. ఎనిమిదేళ్లు ప్రయత్నించినా అతను సఫలం కాలేకపోయాడు. అతని టి20 నాయకత్వంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈసారి జట్టును ఆది నుంచి విజయాల బాట పట్టించాలని యోచిస్తున్నాడు.


(ఇక్కడ చదవండి: ‘నో డౌట్‌.. ఆ జట్టే ఐపీఎల్‌ విజేత’)

ఆర్సీబీ: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), పార్థీవ్‌ పటేల్‌, మొయిన్‌ అలీ, ఏబీ డివీలియర్స్‌,  హెట్‌మెయిర్‌, శివం దుబె, గ్రాండ్‌ హోమ్‌, ఉమేశ్‌ యాదవ్‌, చహల్‌, సిరాజ్‌, నవదీప్‌ షైనీ

సూపర్‌కింగ్స్‌: ఎంఎస్‌ ధోని(కెప్టెన్‌), అంబటి రాయుడు, షేన్‌ వాట్సన్‌, సురేష్‌ రైనా,, కేదార్‌ జాదవ్‌, రవీంద్ర జడేజా, డ్వేన్‌ బ్రేవో, దీపక్‌ చహర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, హర్భజన్‌ సింగ్‌, ఇమ్రాన్‌ తాహీర్‌


(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు