మ్యాక్స్‌వెల్‌కు ఉద్వాసన

4 Jan, 2018 16:13 IST|Sakshi

మెల్‌బోర్న్‌:త్వరలో ఇంగ్లండ్‌తో ఆరంభమయ్యే వన్డే సిరీస్‌ నుంచి ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌కు ఉద్వాసన పలికారు. ఈ మేరకు ప్రకటించిన వన్డే ఆటగాళ్ల జాబితాలో మ్యాక్స్‌వెల్‌ను పక్కన పెట్టేశారు. తన కెరీర్‌లో 80 వన్డేలు ఆడిన మ్యాక్స్‌వెల్‌ను ఎంపిక చేయడానికి కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ పెద్దగా ఆసక్తికనబరచలేదు. ఇటీవల కాలంలో నిలకడగా బ్యాటింగ్‌ చేయడంలో విఫలమవుతున్న మ్యాక్స్‌వెల్‌ ఎంపికపై స్మిత్‌ మొగ్గుచూపలేదు. దాంతో మ్యాక్స్‌వెల్‌కు నిరాశ తప్పలేదు. ఇదిలా ఉంచితే, స్పిన్నర్‌ క్రిస్‌ లిన్‌ను ఎంపిక చేస్తూ క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరిదైన ఐదో టెస్టు జరుగుతుంది. ఈ సిరీస్‌ తరువాత జనవరి 14వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్‌ ఆరంభం కానుంది.

ఆసీస్‌ వన్డే జట్టే ఇదే..

స్టీవ్‌ స్మిత్‌ (కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్‌, కమిన్స్‌, అరోన్‌ ఫించ్‌, హజల్‌వుడ్‌,  ట్రావిస్‌ హెడ్‌, క్రిస్‌ లిన్‌, మిచెల్‌ మార్ష్‌, టిమ్‌ పైనీ, రిచర్డ్‌సన్‌, మిచెల్‌ స్టార్క్‌, స్టోనిస్‌, ఆండ్రూ టై, ఆడమ్‌ జంపా

 

మరిన్ని వార్తలు