భారత్‌కు తొలి ఓటమి

10 Feb, 2020 02:17 IST|Sakshi

భువనేశ్వర్‌: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) ప్రొ హాకీ లీగ్‌లో భారత పురుషుల జట్టుకు తొలి  ఓటమి ఎదురైంది. ప్రపంచ చాంపియన్‌ బెల్జియం జట్టుతో ఆదివారం జరిగిన రెండో రౌండ్‌ రెండో లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా 2–3 గోల్స్‌ తేడాతో ఓడిపోయింది. భారత్‌ తరఫున వివేక్‌ సాగర్‌ ప్రసాద్‌ (15వ ని.లో), అమిత్‌ రోహిదాస్‌ (17వ ని.లో) ఒక్కో గోల్‌ చేశారు. బెల్జియం జట్టు తరఫున మాక్సిమి ప్లెనెవాక్స్‌ (17వ, 26వ ని.లో) రెండు గోల్స్‌ సాధించగా... అలెగ్జాండర్‌ హెండ్రిక్స్‌ (3వ ని.లో) మరో గోల్‌ చేశాడు. మొత్తం తొమ్మిది జట్లు పాల్గొంటున్న ప్రొ హాకీ లీగ్‌లో రెండు రౌండ్‌లు ముగిశాక ప్రస్తుతం బెల్జియం 14 పాయింట్లతో అగ్రస్థానంలో, భారత్‌ ఎనిమిది పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాయి. మూడో రౌండ్‌లో భాగంగా భువనేశ్వర్‌లోనే ఆస్ట్రేలియాతో భారత్‌ ఈనెల 21, 22 తేదీల్లో రెండు మ్యాచ్‌లు ఆడుతుంది.

మరిన్ని వార్తలు