భారత మహిళల జట్టు ఓటమి 

3 Feb, 2020 02:11 IST|Sakshi

కాన్‌బెర్రా: ముక్కోణపు టి20 మహిళల క్రికెట్‌ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ నాలుగు వికెట్ల తేడాతో ఓడింది. తొలుత భారత్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 103 పరుగులు చేసింది. స్మృతి (35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), హర్మన్‌ప్రీత్‌ (28; 4 ఫోర్లు) రాణించారు. ఎలీస్‌ పెర్రీ (4/13) భారత్‌ను కట్టడి చేసింది. అనంతరం ఆసీస్‌ 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసి నెగ్గింది. పెర్రీ (49; 8 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది.

>
మరిన్ని వార్తలు