హైదరాబాద్‌ బౌలర్ల జోరు

10 Jan, 2019 09:58 IST|Sakshi

 జార్ఖండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 152 ఆలౌట్‌

 కల్నల్‌ సీకే నాయుడు క్రికెట్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: కల్నల్‌ సీకే నాయుడు ట్రోఫీ క్రికెట్‌ టోర్నీలో హైదరాబాద్‌ బౌలర్లు ఆకట్టుకున్నారు. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జార్ఖండ్‌తో బుధవారం ప్రారంభమైన మ్యాచ్‌లో రాజమణి ప్రసాద్‌ (3/53), కార్తికేయ (3/36), అబ్దుల్‌ ఖురేషి (3/30) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ప్రత్యర్థి స్వల్ప స్కోరుకే పరిమితమైంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన జార్ఖండ్‌ 47 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. రాహిల్‌ రియాజ్‌ ఖాన్‌ (50; 9 ఫోర్లు) అర్ధసెంచరీ చేయగా, అమర్‌దీప్‌ సింగ్‌ (39; 5 ఫోర్లు) రాణించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన హైదరాబాద్‌ ఆటముగిసే సమయానికి 41 ఓవర్లలో వికెట్‌నష్టానికి 110 పరుగులతో నిలిచింది. తిలక్‌ వర్మ (128 బంతుల్లో 63 బ్యాటింగ్‌; 10 ఫోర్లు), శశిధర్‌ రెడ్డి (76 బంతుల్లో 28 బ్యాటింగ్‌; 3 ఫోర్లు) క్రీజులో ఉన్నారు.

మరిన్ని వార్తలు