‘కోహ్లికి ఈ సిరీసే అసలు పరీక్ష’

29 Dec, 2017 19:25 IST|Sakshi

భారత మాజీ కెప్టెన్‌ బిషన్‌ సింగ్‌ బేడీ

న్యూఢిల్లీ : టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి దక్షిణాఫ్రికా పర్యటనే అసలైన పరీక్షా అని భారత మాజీ కెప్టెన్‌ బిషన్‌ సింగ్‌ బేడి అభిప్రాయపడ్డారు. బ్యాట్స్‌మన్‌గానే కాకుండా కెప్టెన్‌గా అయినా కోహ్లి సత్తా ఏంటో ఈ సిరీస్‌లో తెలుస్తుందని ఈ దిగ్గజ స్పిన్నర్‌ చెప్పుకొచ్చారు. భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ షట్లర్‌ పీవీ సింధూపై బిషన్‌ సింగ్‌ బేడి పొగడ్తల వర్షం కురిపించారు. ప్రపంచ దిగ్గజాలకు సింధూ గట్టి పోటీనిచ్చిందని కొనియాడారు. ఈ ఒలింపిక్‌ పతాక విజేత ఇప్పటికే తన సత్తాను చాటిందన్నారు. సింధూలా తన సామర్థ్యం నిరూపించుకోవడానికి  కోహ్లి ఇబ్బంది పడవచ్చన్నారు. దిగ్గజ జట్టైన దక్షిణాఫ్రికాతో కోహ్లి సేనకు గట్టిపోటీ ఎదురవ్వనుందని తెలిపారు.

>
మరిన్ని వార్తలు